కుక్కపై ప్రేమతో ఆత్మహత్య, వేరుశనగ ఇరుక్కుని మృతి
ఆమె కుమారుడు సాయి (16) వాటిని అత్యంత ప్రేమతో సాకుతూ వచ్చాడు. రెండింటిలో ఓ కుక్క పిల్ల గురువారం రాత్రి మరణించింది. దాన్ని జీర్ణించుకోలేక సాయి శుక్రవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇటీవలే పదో తరగతి పాసయ్యాడు.
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా యాలాల మండలం దేవనూరులో దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. చెన్నప్ప, లక్ష్మిల మూడేళ్ల కూతురు ప్రత్యూష గొంతులో వేరుశనక్కాయ ఇరుక్కుని మరణించింది.
ఇంట్లో వేరుశనక్కాయలు వొలుస్తుండగా ప్రత్యూష ఓ శనక్కాయను మింగింది. ఆడుకుంటూ దాన్ని నోట్లో వేసుకుంది. అది గొంతులో చిక్కుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు విడిచింది.
Comments
English summary
A 16 years old student commited suicide in Ananthapur district, as his pet dog died.