రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుక్కపై ప్రేమతో ఆత్మహత్య, వేరుశనగ ఇరుక్కుని మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Student commit suicide
అనంతపురం/ హైదరాబాద్: మక్కువతో పెంచుకున్న కుక్క మరణించడంతో ఓ విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహ చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రొడ్డంలో శుక్రవారం చోటు చేసుకుంది. రొడ్డం బీసి కాలనీలో ఉంటున్న ముత్యాలప్ప అంజీనమ్మ ఏడాది క్రితం కర్ణాటక రాజధాని బెంగళూర్ నుంచి రెండు కుక్క పిల్లలను తెచ్చింది.

ఆమె కుమారుడు సాయి (16) వాటిని అత్యంత ప్రేమతో సాకుతూ వచ్చాడు. రెండింటిలో ఓ కుక్క పిల్ల గురువారం రాత్రి మరణించింది. దాన్ని జీర్ణించుకోలేక సాయి శుక్రవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇటీవలే పదో తరగతి పాసయ్యాడు.

ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా యాలాల మండలం దేవనూరులో దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. చెన్నప్ప, లక్ష్మిల మూడేళ్ల కూతురు ప్రత్యూష గొంతులో వేరుశనక్కాయ ఇరుక్కుని మరణించింది.

ఇంట్లో వేరుశనక్కాయలు వొలుస్తుండగా ప్రత్యూష ఓ శనక్కాయను మింగింది. ఆడుకుంటూ దాన్ని నోట్లో వేసుకుంది. అది గొంతులో చిక్కుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు విడిచింది.

English summary
A 16 years old student commited suicide in Ananthapur district, as his pet dog died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X