'ఉప్పల్ వైయస్సార్' ఆత్మహత్య: నోట్‌లో జగన్‌కు విజ్ఞప్తి

Sridhar Reddy commits suicide
హైదరాబాద్: 'ఉప్పల్ వైయస్సార్'గా స్థానికంగా పేరున్న ఉప్పల్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత యంజాల శ్రీధర్ రెడ్డి శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రామాంతపూర్ కార్పోరేటర్ పరమేశ్వర్ రెడ్డిపై హత్యయత్నం కేసులో అరెస్టయిన శ్రీధర్ రెడ్డి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. తనను మాల్కాజ్‌గిరి ఏఎస్పీ రాధాకృష్ణ వేధిస్తున్నాడని, రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి 10 పేజీల సోసైడ్ నోట్ కరాసి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆ సూసైడ్ నోట్‌లో తనను వేధిస్తున్న వారిని పేర్కొనడంతో పాటు.. తనను అంబరుపేటలోని ఓ భవంతిలోకి తీసుకు వెళ్లి మూడు రోజుల పాటు తనను కొట్టారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో పది పేజీల సూసైడ్ నోట్‌లో ఓ పేజీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ విజ్ఞప్తిని చేశారు. తాను చనిపోయాక.. తన పిల్లలను, కుటుంబాన్ని ఆదుకోవాలని జగన్‌కు ఓ పేజీలో విజ్ఞప్తి చేశారు.

కాగా తనను పది లక్షల రూపాయలు అడిగితే ఇవ్వలేక, మూడు లక్షలు ఇవ్వడానికి సిద్ధపడినా కనికరించలేదని, మరికొన్ని కేసులు పెట్టి శాశ్వతంగా జైలుకు పంపిస్తానని, రౌడీషీట్ తెరుస్తానని బెదిరించే వారని యంజాల శ్రీధర్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదిన తనపై కక్షగట్టి జైలుకు పంపారన్నారు.

కాగా శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం నడుచుకున్నానని ఏఎస్పీ రాధాకృష్ణ తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎసిపిని సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+