బయటకు చెప్పేవి కాదు: షిండేతో భేటీపై డిగ్గీ, 'టి' వేడి

Sushil Kumar Shinde - Digvijay Singh
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో తాను చర్చించిన విషయాలు బయటకు చెప్పేవి కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆయన ఈ రోజు ఉదయం షిండేతో భేటీ అయ్యారు. బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

షిండేతో మాట్లాడిన అంశాలు బయటకు చెప్పేది కాదని చెబుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలకు రోడ్ మ్యాప్ తయారు చేయమని ఆదేశించామని తెలంగాణ అంశంపై స్పందించారు. రాజకీయ వ్యూహం తయారు చేయమని రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పామన్నారు.

అంతకుముందు దిగ్విజయ్ సింగ్‌తో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణపై సాధ్యమైనంత తొందరగా నిర్ణయం వెలువడుతుందని, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సైతం ఢిల్లీ పెద్దలను కలిశారు. అయితే ఏం చర్చించారనే దానిపై ఆయన స్పందించలేదు.

సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణపై తేల్చాయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. అది తెలంగాణకు అనుకూలంగా ఉంటుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+