సమైక్య జెఏసి డెడ్లైన్: పురంధేశ్వరి, టిఎస్సార్కి సారె
రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు రాజకీయ నాయకులు ఏకతాటి పైకి రావాలని, రాజీనామాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఈ నెల 12వ తేదిలోగా నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. లేదంటే తాము ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు.
రాజీనామా చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు విశాఖ సమైక్యాంధ్ర జెఏసి మంగళవారం కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డికి చీర - సారెను పంపించారు. వారు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎప్పుడు ప్రకటన చేయలేదని అందుకే సారె పంపిస్తున్నట్లు చెప్పారు.
దిగ్విజయ్ను కలిసిన ఎంపీలు
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్లు మంగళవారం రాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.