తెరాసలోకి టిడిపి రెబెల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి

1985 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వేణుగోపాలచారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవల తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరిని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తెరాస ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించారంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఆయనపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. వేణుగోపాలాచారిపై వేటు వేయాలని కోరింది.
ప్రస్తుతం ఎమ్మెల్యే వేణుగోపాలచారి అనర్హత వేటు విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెండింగ్లో ఉంచారు. తెలుగుదేశం పార్టీకి దూరమైన వేణుగోపాలచారి నాగం జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ నగారా సమితితో పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవల నాగం జనార్దన్రెడ్డి నగారాను బీజేపీలో విలీనం చేయడంతో వేణుగోపాలచారి ఒంటరిగా మారారు.
తెలంగాణ వాదిగా మొదటి నుంచి పేరున్న చారికి కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా వేణుగోపాలచారి తెరాసలో చేరేందుకు మార్గం సుగమమైంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications