వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పార్థసారథిపై స్పీకర్‌కు జగన్ పార్టీ నేత ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Adusumilli Jayaprakash - Parthasarathi
హైదరాబాద్: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తాజా తీర్పు ప్రకారం మంత్రి పార్థసారథి శాసన సభ్యుడిగా అనర్హుడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అడుసుమిల్లి జయప్రకాశ్ సోమవారం అన్నారు. పార్థసారథి పైన అనర్హత వేటు వేయాలని అడుసుమిల్లి సభాపతికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

సుప్రీం తాజా తీర్పు ప్రకారం పార్థసారథి అనర్హుడని ఆయన అన్నారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని తాను స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. హైకోర్టు తీర్పు మేరకు పార్థసారథి లక్షన్నర రూపాయల జరిమానా కట్టారని, ఆర్టికల్ 80ఈ ప్రజాప్రాతినిత్య చట్టం ప్రకారం ఆయన సభ్యత్వాన్ని కోల్పోతారన్నారు.

ఈ విషయమై తాను స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే న్యాయనిపుణులతో చర్చిస్తానని చెప్పారన్నారు. పార్థసారథి పైన అనర్హత వేటు వేయకుంటే తాను హైకోర్టుకు వెళ్తానన్నారు. పార్థసారథి దోషి అని న్యాయస్థానం తేల్చిందని, కాబట్టి ఆయన అనర్హుడని అడుసుమిల్లి చెప్పారు.

ప్రత్యర్థులపై దాడులు: భూమన

పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆరోపించారు. సంతలో ఎద్దులను పెట్టి బేరం చేసినట్లుగా సర్పంచులను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు.

English summary
YSR Congress Party leader Adusumilli Jayaprakash has demanded to disqualify minister Parthasarathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X