కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ సంబంధం: జంట ఆత్మహత్య, రైఫిల్స్ గల్లంతు

By Pratap
|
Google Oneindia TeluguNews

suicide
హైదరాబాద్: తిరుపతినగరంలోని చెన్నాయికుంటలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్(కనిగిరి), వెంకటలక్ష్మి (కందుకూరు)గా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ ఆత్మహత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో మైల్యాండ్స్ సంస్థ నిర్వాహకురాలు ఆశను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ మైల్యాండ్స్ సంస్థ ప్రజల వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. తాము మోసపోయామని గ్రహించిన బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని దగ్గర బుధవారం ఉదయం గోదావరిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని ఓ వాగులు పోలీసుల తుపాకులు గల్లంతయ్యాయి. కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తూ వాగును దాటుతుండగా పోలీసులు వరద ఉధృతి పెరగడంతో పోలీసులు జారి పడ్డారు. రెండు తుపాకులు వాగులో జారిపడ్డాయి. వాటి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అయితే, వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాటి జాడ తెలియడం లేదు.

నల్గొండ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపురం దగ్గర ఆగివున్న లారీని వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. అటు భువనగిరిలో ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

English summary
Lovers commit suicide at Tirupathi. The couple is from Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X