సోనియా చెప్పడమే తరువాయి: తెలంగాణపై షిండే

మంగళవారం జైపాల్ రెడ్డితో, షిండే సుమారు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. తెలంగాణపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకోగానే దాని అమలుకు తమ శాఖ చర్యలు తీసుకుంటుందని షిండే చెప్పినట్లు తెలిసింది. తాను రాజకీయ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నానని షిండే చెప్పారు. సోనియాగాంధీ అన్నింటికంటే ఎక్కువగా తెలంగాణకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరలో స్పష్టమైన పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారని షిండే చెప్పినట్లు తెలిసింది.
సోనియాతో పాటు అంతా అనుకూలంగా ఉన్నారని, అన్ని అంశాలను బేరీజు వేసిన తర్వాతే ఆమె ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన అన్నారు. రాజకీయ నిర్ణయం తర్వాత ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంటుందని, మేడమ్ నిర్ణయాన్ని అమలు చేయడమే నా బాధ్యత' అని షిండే చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ రాజకీయంగా రాష్ట్రంలో, ఆ తర్వాత దేశంలో నిలదొక్కుకోవాలంటే తెలంగాణ ఏర్పాటు తప్ప మరోమార్గంలేదని షిండేకు జైపాల్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వడంవల్ల ఇప్పటి వరకూ రాజకీయ ప్రాధాన్యం లభించని అనేక వర్గాలకు అవకాశం లభిస్తాయని ఆయన చెప్పారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ అనేక సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని, సామాజిక న్యాయం జరిగితే కాంగ్రెస్ కూడా బలోపేతమవుతుందని చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications