అక్టోబర్లో 'టి': పాల్వాయి, అసద్కు దత్తాత్రేయ సూచన

తెరాసను కాంగ్రెస్లో విలీనం చేయాలని కోరారు. అయితే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన ఒక నక్షత్రకుడు ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తారోననే ఆందోళన తమకు ఉందన్నారు. ఆ నక్షత్రకుడు కెసిఆర్ను పక్కదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదన్నారు. రెండు రాష్ట్రాల పునర్ విభజన కమిషన్ను వేయాలంటూ గతంలో చేసిన తీర్మానాన్ని సిడబ్ల్యూసి ఉపసంహరించుకొని తెలంగాణకు సిఫార్సు చేసే అవకాశముందన్నారు.
ఇప్పటికే తెలంగాణపై అధిష్ఠానం అన్ని విధాలుగా ఆలోచన చేసిందన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వడానికే సిద్ధంగా ఉందని, రాయల తెలంగాణ అంశాన్ని అధిష్ఠానం పక్కన పెట్టిందని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకులు ప్రశాంతంగా ఉండాలన్నారు. యువకులు, విద్యార్థులు భావోద్వేగానికి గురై ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత భద్రాచలం తెలంగాణతోనే ఉంటుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
అసద్.. అడ్డుపడకు: దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా కొందరు కాంగ్రెసు నేతలు ప్రయత్నిస్తున్నారని, వారు తమ ఎత్తుగడలకు మజ్లిస్ను పావుగా వాడుకుంటున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తామన్న మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలకు అడ్డుపడటం సరికాదని అసద్కు దత్తాత్రేయ హితవు పలికారు.












Click it and Unblock the Notifications