విజయమ్మకు తెలంగాణ సెగ: పార్టీ ఆఫీసు ముట్టడి

ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు జోక్యం చేసుకుని విజయమ్మను ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ సమయంలో మహంకాళి జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి మార్చుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మహిళా భక్తులే విజయమ్మను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఇదిలావుంటే, సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరిని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి (ఓయుజెఎసి) కార్యకర్తలు ఆదివారంనాడు హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు ఆ పార్టీ శానససభ్యులు రాజీనామాలు చేయడంపై వారు మండిపడ్డారు.
తెలంగాణపై సానుకూల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణను అడ్డుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేశారని వారు విమర్శించారు. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications