హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రి చేతుల్లోంచి జారి మూసీ నదిలో పడిన పాప

By Pratap
|
Google Oneindia TeluguNews

Child drowns into Musi river
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం నాడు గురువారం హైదరాబాదులో విషాద సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులోని నాగోలు ప్రాంతంలో రెండేళ్ల బాలిక తండ్రి చేతుల్లోంచి జారి మూసీనదిలో పడింది. శేఖర్ తన భార్య, రెండేళ్ల పాప మానవితో కలిసి ఉప్పల్‌లోని ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మూసీ నదిలో గల్లంతైన బాలికను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. గజఈతగాళ్లు పాప కోసం ప్రయత్నాలు సాగించారు. ఆయినా ఫలితం దక్కలేదు. కాగా, ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని ఉప్పల్, ఎల్బీ నగర్ పోలీసులు సహాయానికి ముందుకు రాలేదని తెలుస్తోంది.

విశాఖపట్నం జిల్లా కొత్తవీధీ మండలం సిగినాపల్లిలో రంగురాళ్ల క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బండరాళ్లు పడి గిరిజనుడు మృతి చెందాడు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అస్వస్థతకు గురైనవారిలో 18 మందిని ఆస్పత్రికి తరలించారు.

English summary

 A two year old child Manavi has drowned into Musi river at Nagole in Hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X