గొడవ: భార్య కళ్లముందే పైనుండి నీళ్లలో దూకిన భర్త
బ్రిడ్జి పై నుండి వెళ్తుండగా వారి మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం. దీంతో మనస్తాపం చెందిన భర్త బ్రిడ్జి పై నుండి ఒక్కసారిగా నీళ్లలోకి దూకారు. తన కళ్ల ముందే భర్త నీళ్లలోకి దూకడంతో భార్య కాపాడాలంటూ కేకలు వేసింది. పోలీసులు, అధికారులు, ప్రజలకు అక్కడకు భారీగా చేరుకున్నారు.
ఆయన కోసం మధ్యాహ్నం నుండి వెతుకుతున్నారు. సాయంత్రం వరకు కూడా ఆచూకీ దొరకలేదు. పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భర్త నీళ్లలోకి దూకాడా? లేక తోసేశారా? అనే కోణంలోను పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సౌభాగ్యను అతను రెండో పెళ్లి చేసుకొని, రహస్య కాపురం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ
కృష్ణా జిల్లా విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో రామాలయం వద్ద దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను తుపాకీతో బెదిరించి బంగారం దోచుకెళ్లారు. సమాచారం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.