వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొడవ: భార్య కళ్లముందే పైనుండి నీళ్లలో దూకిన భర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

Fight
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ భర్త తన భార్య కళ్ల ముందే నీళ్లలోకి దూకిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. భార్యా, భర్తల మధ్య గొడవనే ఇందుకు కారణమని తెలుస్తోంది. భీమవరంలోని బ్రిడ్జి పై నుండి రామకృష్ణ, సౌభాగ్య అనే దంపతులు వెళ్తున్నారు.

బ్రిడ్జి పై నుండి వెళ్తుండగా వారి మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం. దీంతో మనస్తాపం చెందిన భర్త బ్రిడ్జి పై నుండి ఒక్కసారిగా నీళ్లలోకి దూకారు. తన కళ్ల ముందే భర్త నీళ్లలోకి దూకడంతో భార్య కాపాడాలంటూ కేకలు వేసింది. పోలీసులు, అధికారులు, ప్రజలకు అక్కడకు భారీగా చేరుకున్నారు.

ఆయన కోసం మధ్యాహ్నం నుండి వెతుకుతున్నారు. సాయంత్రం వరకు కూడా ఆచూకీ దొరకలేదు. పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భర్త నీళ్లలోకి దూకాడా? లేక తోసేశారా? అనే కోణంలోను పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సౌభాగ్యను అతను రెండో పెళ్లి చేసుకొని, రహస్య కాపురం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ

కృష్ణా జిల్లా విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో రామాలయం వద్ద దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను తుపాకీతో బెదిరించి బంగారం దోచుకెళ్లారు. సమాచారం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

English summary
One husband was jumped in to water in West Godavari district on Thursday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X