భవనం కూలి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రి తరలించారు. ఆకుల ఆంజనేయులుకు చెందిన ఈ భవనం పక్కన ఖాళీ స్థలంలో కొత్తగా భవనం నిర్మంచడానికి రెండు రోజుల క్రితం పొక్లెయిన్ సహాయంతో పునాదులు తవ్వారు. దీనివల్లనే భవన కూలిందని భావిస్తున్నారు.
ఇంటి యజమాని ఆకుల ఆంజనేయులు, ఆయన భార్య వెంకటలక్ష్మిలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఆంజనేయులు, కుమారుడు జశ్వంత్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి రాజమండ్రి అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తి, ఫైర్ ఆఫీసర్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటన తెలిసి నగరానికి చెందిన వందలాది మంది ఇక్కడ చేరుకున్నారు.
ఇద్దరు అక్కడికక్కడ మరణించగా, ఓ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. కూలిన భవనం మూడంతస్థులతో కూడి పాతపడింది.












Click it and Unblock the Notifications