భార్యపై అనుమానం: కొడుకు హత్య, ఆత్మహత్యాయత్నం

అతని భార్య శ్రీలత ఓ ప్రైవేట్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నది. వీరి కుమారుడు వెంకటసాయి (4) స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గత నెల 28న భార్యను కొట్టాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లింది.
సత్యనారాయణ తల్లి నాగమణి వారం రోజులుగా వెంకటసాయి ఆలనాపాలనా చూసుకుంటుంది. భార్య అలిగి వెళ్లిందన్న కోపంతో తప్ప తాగి వచ్చిన సత్యనారాయణ బుధవారం రాత్రి నిద్రిస్తున్న కుమారుడి గొంతు నులిమి చంపాడు. అనంతరం భయంతో కత్తితో మెడ, చేతులపై కోసుకున్నాడు.
గురువారం ఉదయం నాగమణి గమనించి ఇంటి పక్కన ఉంటున్న వారికి తెలిపింది. దీంతో వారు సైదాబాద్ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి, తండ్రిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications