3 నెలల్లో తెలంగాణ: సుప్తచేతనలో ప్రభుత్వం

రాష్ట్ర విభజన నేపథ్యంలో సమస్యలు తలెత్తితే ప్రభుత్వాన్ని సుప్తచేతనావస్థలో (సస్పెండ్ యానిమేషన్లో) పెట్టి ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్ను రూపొందించి, దానికి సంబంధించిన కాపీని న్యాయశాఖకు పంపించినట్లు సమాచారం. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారనే ఊహాగానాలకు కూడా ఆ నోట్ తెర దించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని ఎకె ఆంటోనీతో పాటు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరం, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర నేతలకు స్పష్టం చేస్తూ ఢిల్లీ సమయం వృధా చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఢిల్లీ చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవడానికి బదులు సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసే ఆలోచన చేయాలని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెనక్కి తగ్గబోరని కచ్చితంగా చెబుతూ నదీ జలాల పంపిణీ, విద్యుత్తు, తదితర వివాదాస్పద అంశాలను పార్టీ అధిష్టానం, కేంద్రం పరిష్కరిస్తాయని వారు చెబుతున్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అలోచన కూడా ఏమీ లేదని అంటున్నారు. సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని యధాతథంగా అమలు చేయడమే ఇప్పుడు చేసే పని అని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications