గాంధీ సిద్దాంతాల సాకారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఇంద్రకరణ్ రెడ్డి
జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకొని నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని మంచిర్యాల చౌరస్తా వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఆయన, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి, అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అన్నారు. గాంధీ చూపిన పోరాట మార్గం మనందరికీ ఆదర్శనీయమన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి అని, గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు.

మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహ స్పూర్తితోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. ఇక ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి అవకాశం ఉంటుందనే భావనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలు చేస్తున్నామని తెలిపారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మరోవైపు ప్లాస్టిక్ వాడకం నుంచి ప్రజలను దూరం చేయటంతోపాటు.. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ సహాకరించాలని మంత్రి కోరారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications