ఆంద్రప్రదేశ్ పేరు అంటేనే మోదీకి అలెర్జీ..! ఘాటుగా విమర్శించిన చంద్రబాబు..!!
Recommended Video

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, రాష్ట్రానికి వందల సంఖ్యలో అవార్డులు వస్తున్నాయి, ఇది చూసి ఓర్వలేక ఏపీపై అసూయ పెంచుకుంటున్నారని ముఖ్యమంత్ర చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కేంద్ర బీజేపి పైన లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఏపీ పురోగతి చూసి కేంద్ర నాయకులు భరించలేకపోతున్నారని, ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే వారిలో ఒకరకమైన ప్రకంపనలకు పెరిగిపోతున్నాయని, అడుగడుగునా కక్ష సాధిస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేసారు. చివరికి వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారని ప్రధాని మోడీని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు.

ప్రధాని మోడీ నైరాశ్యంలో ఉన్నట్టు కనిపిస్తోందని, హుందాతనం వదిలేసి అసహనంతో, అసూయతో ఆంద్ర ప్రదేశ్ మీద నిందలు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మోడీ తన కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది అందరూ ఊహించిందే అన్నారు. చెప్పుకోవడానికి మోడీ ఆంద్ర ప్రదేశ్ కి చేసిందేమీ లేదని అందుకనే ఇటువంటి చౌకబారు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
చివరికి ఏపి శకటం పైన కూడా ఆంక్షలు విధిండం భాదాకరమని తెలిపారు. రిపబ్లిక్ డే కు ఏపి శకటం లేకుండా చేస్తున్నారని, ఇది కేంద్రంలో బిజెపి కక్షసాధింపునకు పరాకాష్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వక పోవడంపై కేంద్రానికి లేఖ రాసి వారు అనుసరిస్తున్న వివక్షతను బహిర్గతం చేయాస్తామని ఏపీ సీయం చంద్రబాబు హెచ్చరించారు. కేంద్ర కక్షపూరిత రాజకీయాలు ఇతర రాష్ట్రాలు గమనించాలని బాబు విజ్ఞప్తి చేసారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications