Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గన్ లే.. జగన్ రాలే... అనూష ఇన్సిడెంట్‌ ప్రస్తావన.. సర్కార్‌పై నారా లోకేశ్ ఫైర్

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని చెప్పారు. మృగాళ్లు రెచ్చిపోతున్న ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూషను ప్రేమ పేరుతో విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హతమార్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు వరస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపట్టారు.

నరసరావుపేట ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... నారా లేకేశ్ స్పందించారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ ఉందా అని ఫైరయ్యారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారని మండిపడ్డారు. కానీ అంత సీన్ లేదని చెప్పారు. దిశ చట్టం అంటూ మాయ చేశారని ఫైరయ్యారు.

nara lokesh slams ap cm ys jagan

ఇప్పుడు ఏం జరిగినా గన్ను రావడం లేదని.. జగన్ కనపడటం లేదని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒక మహిళకు కూడా న్యాయం జరిగింది లేదని చెప్పారు. కళ్ల ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ లో చలనం రావడం లేదని దుయ్యబట్టారు. నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చి నుంచి బయటికు రావాలని సూచించారు. మహిళల రక్షణ తగిన చర్యలు తీసుకోవాలని సజెస్ట్ చేశారు.

అనూషని హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికసాయం అందజేసి భరోసా కల్పించాలని కోరారు. నిందితులకు వెంటనే శిక్ష పడితే కుటుంబం ఆనందపడుతుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+