రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మంలో కలకలం: 13మందిని కిడ్నాప్ చేసిన మావోలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖమ్మం జిల్లా సరిహద్దులో మావోయిస్టుల కలకలం చెలరేగింది. చింతూరు మండలం పేగకు చెందిన 13 మంది గిరిజనులను మావోయిస్టులు అపహరించి ఉంటారనే వార్తలు వస్తున్నాయి. వీరిని సోమవారం రాత్రి వారు అపహరించి ఉంటారని అంటున్నారు.

అయితే, వారి అపహరణ రెండు మూడు రోజుల క్రితమే జరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఆళస్యంగా వెలుగులోకి వచ్చిందంటున్నారు. అయితే, ఈ కిడ్నాప్‌ను పోలీసులు ధృవీకరించలేదు. ఒక ఇంటికి చెందిన ఏడుగురు, మరో ఇంటికి చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. తుపాకులతో బెదిరించి తీసుకెళ్లారని అంటున్నారు. అయితే మావోయిస్టులే ఈ పనికి పాల్పడ్డారా మరొకరు పాల్పడ్డారా తెలియాల్సి ఉంది.

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

13 villagers kidnapped by Maoists?

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఇన్నీస్ పేట ప్రభుత్వం జూనియర్ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

అగ్ని ప్రమాదం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పట్టణ కేంద్రంలోని ట్రంక్ రోడ్డు సమీపంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సీమా సెంటర్ వద్ద హోటలులో గ్యాస్ లీకై మంటలు వచ్చాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు.

English summary
13 villagers kidnapped by Maoists in Khammam district?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X