ఏపీలో కొత్తగా 1732 పాజిటివ్ కేసులు... మరో 14 మంది మృతి...
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 1732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (నవంబర్ 11) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా మరో 1761 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24గంటల్లో మొత్తం 70,405 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 788.63లక్షలకు చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 344 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 246 కేసులతో కృష్ణా జిల్లా.. 227 కేసులతో పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,19,501 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా నమోదైన మరణాల్లో...కృష్ణా జిల్లాలో ముగ్గురు,అనంతపురం,చిత్తూరు,విశాఖపట్నం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు,తూర్పు గోదావరి,గుంటూరు,నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.
ఇక దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,36,011లక్షలకు చేరింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 44,281 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా మరో 512 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,27,571కి చేరింది. ప్రస్తుతం దేశంలో కేవలం 4,94,657 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకూ 80,13,783 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.దీంతో జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.79శాతానికి చేరింది. మరణాల రేటు 1.48శాతంగా ఉంది.
Recommended Video
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications