ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులుంటే, 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 55,740 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 349 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,81,948కి చేరింది.
గత 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 7104కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 16, చిత్తూరులో 50, తూర్పుగోదావరిలో 28, గుంటూరులో 44, కడపలో 24, కృష్ణాలో 75, కర్నూలులో 7, నెల్లూరులో 9, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 26, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 46 కరోనా కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 472 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,71,588కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3256 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,17,64,418 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications