వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు మావోలు అరెస్టు, భారీగా గంజాయి పట్టివేత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

4 Maoists arrested in Vijayanagaram
హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట వద్ద నలుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐతే మావోయిస్టుల అరెస్ట్ విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.

విశాఖలో గంజాయి పట్టివేత

విశాఖపట్నంలోని జి.మాడుగుల మండలం మత్యృపురం వద్ద 120 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భారీగా ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లా లంకమల అభయారణ్యం లోతువంక బీటులో ఎర్రచందనం డంపును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో తనిఖీ నిమిత్తం వెళ్లిన అటవీశాఖ అధికారులకు మొదట 30 ఎర్రచందనం దుంగలు కనిపించాయి.

ఆ తర్వాత అక్కడికి సమీపంలోనే పది టన్నుల ఎర్ర చందనం డంప్‌ను గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులను గమనించిన తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పరారయ్యారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా..

English summary

 Four Maoists were arrested on monday in Andhra Pradesh's Vijanagaram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X