నలుగురు వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలదే గెలుపు

గత శాసనసభలో వైయస్ జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 18 మంది ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే వారందరికీ మంత్రి పదవులు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతారు. అయితే, పార్టీ ఓటమి పాలు కావడంతో పాటు వారిలో నలుగురు మాత్రమే విజయం సాధించారు.
తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లకు తమ పార్టీకి వచ్చిన ఓట్లకు మధ్య తేడా చాలా స్వల్పంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుకుంటున్నారు టిడిపిపై కేవలం 1.96 శాతం ఓట్ల తేడాతోనే తాము ఓడిపోయామని అంటున్నారు. అంటే 5.6 లక్షల ఓట్లు
తెలుగుదేశం పార్టీకి 1.34 కోట్ల ఓట్లు రాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 1.29 కోట్ల ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 46.86 శాతం కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పడిన ఓట్ల శాతం 44.9. స్వల్ప తేడాతోనే వైయస్సార్ కాంగ్రెసుపై తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.












Click it and Unblock the Notifications