పెళ్లీడుకొచ్చిన పిల్లలుండగా, పథకం వేసి పెళ్లి: ఫ్రెండ్ కోర్కె తీర్చలేదని చంపేశాడు
పెళ్లీడుకొచ్చిన పిల్లలున్న ఓ ప్రబుద్ధుడు మరో యువతికి మాయమాటలు చెప్పి రెండో వివాహం చేసుకున్నాడు.హైదరాబాద్ తీసుకెళ్లి ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారం కాజేసి, ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశాడు.
నెల్లూరు: ఎంసిఎ చదివిన అమ్మాయిని పథకం ప్రకారం పెళ్లి చేసుకుని ఆ తర్వాత కాటికి పంపించాడు. పైగా తన మిత్రుడితో కలిసి ఆమెను హత్య చేశాడు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం కట్టుబడిపాళెంకు చెందిన చీదెళ్ల రంగయ్య, అంకమ్మ దంపతుల కూతురు జయంతి (33).
ఆమె ఎంసీఏ పూర్తి చేసింది. అల్లూరు మండలం ఇస్కపాళెం పరిధిలోగల ఖాదర్నగర్కు చెందిన ఖాదర్ మస్తాన్ అనే వ్యక్తి ఆటో నడిపేవాడు. అప్పటికే అతనికి పెళ్లయింది. ఆటోలో రాకపోకలు సాగిస్తూ వచ్చిన జయంతికి తనకు పెళ్లి కాలేదని నమ్మించాడు.
ఆ అమ్మాయిని క్రమంగా ప్రేమవ్యవహారంలోకి దించాడు. జయంతిని తీసుకుని గత జనవరి 7వతేదీన ఖాదర్ మస్తాన్ తిరుమల వెళ్లాడు. అక్కడ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.8వతేదీన భర్తతో కలిసి జయంతి ఇంటికి వచ్చి తల్లి అంకమ్మకు జరిగిన సంగతి చెప్పింది. అనంతరం ఇద్దరూ హైదరాబాద్ వెళ్లారు.
తల్లికి ఫోన్...
జనవరి 11వ తేదీన తల్లికి జయంతి ఫోన్ చేసింది. ఆ తరువాత నుంచి ఏ విధమైన ఫోన్ రాలేదు. అనుమానం వచ్చిన అంకమ్మ, ఖాదర్ మస్తాన్ వివరాలు సేకరించింది. అతనికి అప్పటికే పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారని ఆమెకు తెలిసింది. చివరికి మార్చి 27వ తేదీన కూతురు కనిపించడంలేదని అంకమ్మ బుచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న బుచ్చి సీఐ సుబ్బారావు, ఎస్ఐ నాగశివారెడ్డి నిందితుడి కోసం పలుమార్లు ఖాదర్నగర్లో వెళ్లి భార్య, బంధువులను విచారించినా ఫలితం కనిపించలేదు.
ఫోన్కాల్ ఆధారంగా...
రెండు వారాలుగా మస్తాన్ ఇంటిపై నిఘా పెట్టిన పోలీసులు మస్తాన్ ఫోన్ కాల్స్పై నిఘా పెట్టారు. మస్తాన్ను, అతని స్నేహితులను పోలీసులను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. మస్తాన్ అతడి స్నేహితుడైన నాయుడుపేట అన్నమేడుకు చెందిన నరేష్ను కూడా వెంట తీసుకుని హైదారబాద్ వెళ్లి అక్కడి నుంచి నిర్మల్ వెళ్లారు. అక్కడ ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఇంట్లో కాపురం పెట్టారు.
హత్య చేసి నాటకం...
స్నేహితుడు నరేష్తో కలిసి జనవరి 9వతేదీన మస్తాన్ జయంతిని హత్య చేశాడని, ఆ తర్వాత ఉరేసుకుని ఆమె మరణించినట్లు చిత్రీకరించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే జయంతి మృతిపై నిర్మల్ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదుచేసినట్లు సమాచారం.
ఆ తర్వాత పరారీలో..
నిర్మల్లో కేసు నమోదైన తర్వాత మస్తాన్ వలీ కనిపించకుండా పోయాడు. చివరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఖాతర్ దోపాటు అతనికి సహకరించిన నరేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
స్నేహితుడి కోరిక తీర్చనందుకే..
ఖాదర్ స్నేహితుడు నరేష్ తన కోరికను తీర్చని కారణంగానే అతడు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జయంతిని వివాహం చేసుకోవడంతో ఖాదర్ ఇంట్లోనూ, ఆమె ఇంట్లోనూ వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఖాదర్ తన స్నేహితుడైన నాయుడుపేటకు చెందిన నరేష్ను సాయం కోరాడు. ఖాదర్, జయంతి, నరేష్ కలిసి జనవరి 10వ తేదీన హైదరాబాద్కు చేరుకున్నారు. అక్కడ్నుంచి నిర్మల్లోని శివారుప్రాంతమైన శాంతినగర్కు వెళ్లారు. అక్కడ ఏం చేయాలని చర్చించుకున్నారు. కాగా, ఖాదర్ బహిర్భూమికని బయటికి వెళ్లగా.. నరేష్.. జయంతిపై అత్యాచారానికి యత్నించాడు. జయంతి ప్రతిఘటించడంతో ఆమె గొంతునులిమి చంపేశాడు. తిరిగొచ్చిన ఖాదర్కు విషయం చెప్పాడు నరేష్. దీంతో ఎవరికి అనుమానం రావద్దని జయంతి గొంతులో పురుగుల మందు పోశారు. అనంతరం ఆమెపై ఉన్న రెండున్నర సవర్ల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. జనవరి 11న ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా, బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు నిందితులు ఇచ్చిన సమాచారంతో వారిని నిర్మల్ తీసుకెళ్లారు. ఆ మృతదేహం జయంతిదేనని నిర్ధారించారు.