రౌడీ షీటర్ దారుణ హత్య: మరో ఘటనలో యువకుడు

మరో ఘటనలో గుంటూరు జిల్లా వినుకొండ మండలం దొండపాడు-నడిగడ్డ మధ్య ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు.
దోపిడీ దొంగల బీభత్సం
కృష్ణా జిల్లాలోని బావులపాడు మండలం ఆరుగొలను వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దుండగులు లారీ డ్రైవర్ సహా ముగ్గురి గొంతుకోసి పరారయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం చేదువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి చెట్టు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications