పల్లెల్లో పండుగ:నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి అభివృద్ధి మంత్ర..!
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేడు 'చంద్రన్న పల్లెపండుగ' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గొల్లకందుకూరు గ్రామంలో ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. తొలి రోజు గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్తవెల్లంటి, పాతవెల్లంటి, కందమూరు గ్రామాల్లో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, పండుగ వాతావరణాన్ని తలపించారు.
ఈ సందర్భంగా, నియోజకవర్గంలోని పలు కీలక అభివృద్ధి పనులను ప్రారంభించి, వాటిని ప్రజలకు అంకితం చేశారు. సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం వంటివి ఈ పనుల్లో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం రానున్న నాలుగు రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో కొనసాగనుంది. మొత్తం 18 గ్రామాలలో రూ. 11 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు అనుభవంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.
ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ, పోలవరం ప్రాజెక్టును ముందుకు నడిపిస్తూ, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.
చంద్రన్న పల్లెపండుగకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపిరి పోసినట్లయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
-
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications