Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో ఇరుక్కున్న యువతి: గంటన్నరపాటు నరకం (వీడియో)

విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్లో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ విద్యార్థిని రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. అన్నవరం నుంచి దువ్వాడ వచ్చిన ఆమె.. రైలు దిగుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు గంటన్నరపాటు యువతి రైలు, ప్లాట్‌ఫాం మధ్యనే నరకయాతన అనుభవించారు.

చివరికి గంటన్నరపాటు శ్రమించిన రైల్వే సిబ్బంది.. యువతిని బయటకు తీశారు. ప్లాట్ ఫాం పగలగొట్టిన సిబ్బంది.. యువతిని సురక్షితంగా బయటకు తీయడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

a student stuck between the train and the platform at duvvada railway station, Visakhapatnam

అనంతరం రెస్క్యూ బృందం ఆ యువతిని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని దువ్వాడ కాలేజీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోందని, ఆమె అన్నవరానికి చెందిన శశికళగా గుర్తించారు. ప్రస్తుతం యువతి క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రయాణికులు జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. కాగా, యువతిని కాపాడిన రైల్వే సిబ్బందికి నలువైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+