వివాహేతర సంబంధం: భర్తను దహనం చేసిన భార్య
వరంగల్: జిల్లాలోని మండలంలోని పోనుగోడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ, తన భర్తను సజీవ దహనం చేసింది. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. పోనుగోడుకు చెందిన భూక్య వీరన్న, నీలమ్మ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం వీరు మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడే నీలమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం తెలుసుకున్న వీరన్న.. ఇటీవల తన కుటుంబంతోపాటు పోనుగోడుకు వచ్చాడు. నీలమ్మ వారం రోజులుగా మళ్లీ హైదరాబాద్కు వెళ్దామని భర్త భూక్య వీరన్నపై ఒత్తిడి చేస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో నీలమ్మ, ఏప్రిల్ 26న ఉదయం మద్యం సేవించి వచ్చిన వీరన్న కాళ్లు, చేతులను మంచానికి కట్టేసి అతని మీద బట్టలు వేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది.
పెద్ద ఎత్తున మంటలు రావడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే వీరన్న మృతి చెందాడు. మొదట తనకేమి తెలియదన్న నీలమ్మ, పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. తానే తన భర్తను సజీవ దహనం చేసినట్లు వెల్లడించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications