ఎంపిటిసిపై అత్యాచారయత్నం: మూగ బాలికపై రేప్

ఇది ఇలా ఉండగా జిల్లాలోని రోలుగుంట మండలంలో జరిగిన దారుణం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. మూగ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జెపి ఆగ్రహారం గ్రామానికి చెందిన 14ఏళ్ల మూగ బాలికపై అదే గ్రామానికి చెందిన దాసు అనే యువకుడు జులై 6న మాయమాటలు చెప్పి ఊరు బయట పొలాల్లోకి తీసుకెళ్లాడు.
మానసికంగా కూడా వికలాంగురాలైన బాలిక అతనితో వెళ్లింది. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు యువకుడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు మంగళవారం నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్నీని ఆశ్రయించారు. కేసు విచారణ చేయాల్సింది కొత్తకోట సిఐ కృష్ణవర్మను ఏఎస్పి ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications