లిక్కర్ కేసులో కీలక మలుపు - ధనుంజయరెడ్డి సహా మరో ఇద్దరికి బెయిల్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది. కాగా, ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ లో ఉన్న మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తో పాటుగా బాలాజీ గోవిందప్పకు బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పలు షరతులు విధించింది.
లిక్కర్ కేసులో కీలకంగా భావించిన ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి ఈ కేసులో ఏ 31గా ఉన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి ధనుంజయ రెడ్డి పాత్ర పైన సెట్ అనేక అంశాలను ఛార్జ్ షీట్ లో ప్రస్తావన చేసింది. అదే విధంగా జగన్ ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ దక్కింది. ఇక.. ఈ కేసులో ఏ 33గా ఉన్న బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు అయింది. ఈ ముగ్గురు ఒక్కొక్కరూ రూ లక్ష చెప్పున రెండు షూరిటీ ఇవ్వాలని... పాస్ పోర్టులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు ఈ ముగ్గురు బయటకు రావటానికి అవకాశం ఏర్పడింది.

ఈ రోజు ఉదయమే ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కోసం మిథున్ రెడ్డికి వెసులుబాటు ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మిథున్ రెడ్డి తిరిగి ఈ నెల 11న సరెండర్ కావాల్సి ఉంది. దీంతో, కొద్ది సేపటి క్రితమే మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. కాగా.. ఇదే రోజున ఈ కేసులో దాదాపు 120 రోజులుగా రిమాండ్ లో ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు అయింది. మూడు సార్లు ఈ ముగ్గురు బెయిల్ కోసం ప్రయత్నించారు. తాజాగా చేసిన వాదనల్లో తాము 90 రోజులకు పైగా రిమాండ్ లో ఉన్నామని.. కేసులో కొత్తగా పురోగతి లేదని వాదనలు వినిపించారు. ఇక.. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 12 మందిలో ఎనిమిది మందికి బెయిల్ దక్కటం కీలకంగా మారుతోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications