మళ్లీ ఎన్కౌంటర్: ఇద్దరు మావోల మృతి, స్వగ్రామానికి ఆర్కే కొడుకు మృతదేహం
మల్కాన్గిరి/విశాఖ: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ అటవీప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సోమ, మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో అగ్రశ్రేణి నాయకులతో సహా 28 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఘటనతో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 30కి చేరింది.

కాగా, ఏవోబీలో కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీగా పోలీసు బలగాల మల్కాన్గిరి ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. నాలుగు రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏపీ డీజీపీ, ఒడిశా పోలీసులు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సొంత గ్రామానికి ఆర్కే కుమారుడి మృతదేహం
సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా మృతదేహాన్ని అతని సొంత గ్రామం ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం అల్లాపూర్కు తరలించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అక్కడికి భారీ ప్రజలు చేరుకున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం మున్నా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications