కడపలో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన ర్యాలీ, ఆందోళన
కడప: అగ్రిగోల్డ్ యజమాన్యం చేతిలో మోసపోయిన తమను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బాధితులు ఆరోపించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. కడపలో శ్రీనివాసం నుంచి పూర్ణకుంభం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు. బాధితులకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ యజమాన్యం కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో 70 ఎకరాలు, తిరుపతిలోని బినామి పేరుమీద ఉన్న స్థలాన్ని అమ్మేసినట్లు ఆరోపించారు.












Click it and Unblock the Notifications