అనారోగ్యంతో బిజెపి నేత టైగర్ ఆలె నరేంద్ర కన్నుమూత

టైగర్ నరేంద్ర 1946 ఆగస్టు 1వ తేదీన హైదరాబాదులో జన్మించారు. ఆయన మెదక్ జిల్లా నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన మొదటి నుండి బిజెపిలో ఉన్నారు. అనంతరం తెలంగాణ కోసం తెలంగాణ సాధనా సమితి పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు.
అతను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో వచ్చిన విభేదాల వల్ల ఆయన పార్టీకి దూరమయ్యారు. తెరాస ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత ఇతర పార్టీలోకి వెళ్లారు. బిజెపి తెలంగాణ కోసం ఉద్యమించిన నేపథ్యంలో ఆయన తిరిగి రెండేళ్ల క్రితం బిజెపిలోకి వచ్చారు. ఆలె నరేంద్రకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య పేరు లలిత. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.












Click it and Unblock the Notifications