Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనారోగ్యంతో బిజెపి నేత టైగర్ ఆలె నరేంద్ర కన్నుమూత

 Ale Narendra dies
హైదరాబాద్: హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఆలె నరేంద్ర బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందారు. ఆయన వయస్సు 68. ఆలె నరేంద్రను టైగర్ నరేంద్ర అంటారు. ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

టైగర్ నరేంద్ర 1946 ఆగస్టు 1వ తేదీన హైదరాబాదులో జన్మించారు. ఆయన మెదక్ జిల్లా నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన మొదటి నుండి బిజెపిలో ఉన్నారు. అనంతరం తెలంగాణ కోసం తెలంగాణ సాధనా సమితి పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు.

అతను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో వచ్చిన విభేదాల వల్ల ఆయన పార్టీకి దూరమయ్యారు. తెరాస ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

ఆ తర్వాత ఇతర పార్టీలోకి వెళ్లారు. బిజెపి తెలంగాణ కోసం ఉద్యమించిన నేపథ్యంలో ఆయన తిరిగి రెండేళ్ల క్రితం బిజెపిలోకి వచ్చారు. ఆలె నరేంద్రకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య పేరు లలిత. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+