ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం: అలీ సోదరుడికి గాయాలు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఔటర్ రింగు రోడ్డులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు హాస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యూంకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని కోహెడ ప్రాంతంలో రింగు రోడ్డు నుండి ఖయ్యూం స్కార్పియో కారులో వెళ్తుండగా ఓ టిప్పర్ ఢీకొంది. దీంతో ఖయ్యూంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మరోవైపు బుధవారం తెల్లవారుజామున వేర్వేగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండకు చెందిన ముగ్గురు తమిళనాడులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ నెల 22న వారు మదనపల్లి నుండి బయలుదేరి అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొంది.
ప్రకాశం జిల్లాలో సంతమాగలూరు వద్ద సుమోను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా తిరువూరు బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరువూరు రాజపేటకు చెందిన వెంకటకృష్ణ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి బైక్ పైన వెళ్తుండగా బైపాస్ రోడ్డు పెట్రోలు బంకు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications