మాజీ మంత్రులపై ఏపీ సీఐడీ కేసు, 796 మంది తెల్లరేషన్ కార్డుదారులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు
అమరావతి భూముల కొనుగోలు కేసులో ఏపీ సీఐడీ మాజీ మంత్రులపై కేసు నమోదు చేసింది. రాజధాని ప్రాంతంలో దళితుల నుంచి మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పీ నారాయణ బలవంతంగా భూములు కొనుగోలు చేశారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. దీంతో అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి సీఐడీ విచారణ కీలక మలుపు తిరిగింది. మంత్రులు ఎక్కడ, ఎవరి పేరుతో ఎంత మొత్తంలో భూములు కొనుగోలు చేశారనే అంశం విచారణలో వెలుగులోకి రానుంది.

దళితుల నుంచి..
అమరావతిలో దళిత మహిళల నుంచి భూములు కొనుగోలు చేశారని ఎఫ్ఐఆర్లో సీఐడీ పేర్కొంది. అయితే వారు ఇష్టంతో కాకుండా బలవంతంగా భూములు కొనుగోలు చేశారని వివరించింది. దీనికి సంబంధించి మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నది. వారిద్దరూ నేరపూరిత కుట్ర చేశారని, మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

769 మందిపై కేసు
మరోవైపు ల్యాండ్ పూలింగ్పై సీఐడీ విచారణ కొనసాగుతోంది. రాజధాని ప్రాంతంలో 796 తెల్లరేషన్ కార్డుదారులపై కూడా కేసు నమోదు చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారు ఎకరం రూ.3 కోట్లు పెట్టి భూమి ఎలా కొనుగోలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో తెల్లరేషన్ కార్డు వారు కొనుగోలు చేసిన భూముల విలువ రూ.300 కోట్ల పై మాటే అని సీఐడీ గుర్తించింది. ఈ మేరకు రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసి.. నగదు ఎక్కడినుంచి తీసుకొచ్చారనే అంశంపై కూడా ఆరాతీస్తున్నారు.

ఎవరి కోసం..
ఆ భూములు ఎవరి కోసం కొనుగోలు చేశారు..? నగదు ఎవరి ఇచ్చారు అనే అంశంపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. భూముల కొనుగోలుకు సంబంధించి నాలుగు బృందాలు విచారిస్తున్నాయి. మాజీ మంత్రులపై క్రిమినల్ కేసు, తెల్లరేషన్ కార్డుదారులపై విచారణ కోసం టీమ్స్ పనిచేస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
-
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications