అదే జరిగితే నేను నైతికంగా ఓడినట్లే - అంబటి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. కీలక నియోజకవర్గాల్లో సీనియర్లు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి వర్సస్ వైసీపీ అన్నట్లుగా ఎన్నికల యుద్దం కొనసాగుతోంది. వామపక్షా లతో కలిసి కాంగ్రెస్ కూటమి బరిలోకి దిగింది. టీడీపీ, వైసీపీ నుంచి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన ఆసక్తి నెలకొంది. సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబ తన గెలుపు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
అంబటి వర్సస్ కన్నా
అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి రెండో సారి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నాటి టీడీపీ అభ్యర్ది కోడెల శివప్రసాద్ పైన 20,876 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన యర్రం వెంకటేశ్వర రెడ్డికి 9,279 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి అంబటి పోటీ చేస్తుండగా..టీడీపీ నుంచి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య కొంత కాలంగా హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. ఇద్దరు నేతలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ బస్సు యాత్ర తరువాత వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారాయని అంబటి మద్దతు దారులు చెబుతున్నారు.

గెలుపు పై ధీమాగా
సత్తెనపల్లిలో చంద్రబాబు నిర్వహించిన సభ సైతం సక్సెస్ అయింది. ఈ సారి గెలవాలనే లక్ష్యంతో కన్నా అడుగులు వేస్తున్నారు. సత్తెనపల్లి ఎన్నికల పైన మాట్లాడి మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ ను టార్గెట్ చేసారు. పవన్ రాజకీయాలకు పనికి రాడని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ డైలాగ్లు సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ రాజకీయాల్లో పని చేయవని అన్నారు. ఇక, తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని గోబెల్స్ ప్రచారం జరిగిందని మండిపడ్డారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన విజయం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేసారు.
నైతికంగా ఓడినట్లే
ఇదే సమయంలో..2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈ సారి ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓడినట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి నుండి అనిల్ కుమార్ యాదవ్కు అత్యధిక మెజార్టీ రావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయమని చెప్పుకొచ్చారు. పల్నాడులో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎంపీ సీటును గెలుచుకుంది. ఈ సారి నర్సరావు పేట ఎంపీ సీటులోనూ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు - అనిల్ కుమార్ యాదవ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన పల్నాడులో ఎవరికి విజయం దక్కుతుందనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications