ట్విస్ట్: 2 వారాల్లో రూ. 10 కోట్లు చెల్లిస్తే సదావర్తి భూములు మీకే : హైకోర్టు
సదావర్తి సత్రం భూములపై ఉమ్మడి హైకోర్టు సోమవారం నాడు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ సర్కార్ సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాల భూమిని కొంతమంది పెద్దలకు రూ.22 కోట్లకే కట్టబెట్టారు. అయితే ఈ విషయమై మరో 10 కో
హైదరాబాద్: సదావర్తి సత్రం భూములపై ఉమ్మడి హైకోర్టు సోమవారం నాడు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ సర్కార్ సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాల భూమిని కొంతమంది పెద్దలకు రూ.22 కోట్లకే కట్టబెట్టారు. అయితే ఈ విషయమై మరో 10 కోట్లు చెల్లిస్తే ఈ భూములను కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టు తెలిపింది. అయితే రెండు వారాల్లో ఈ డబ్బును చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాలల భూమిని కొంతమంది పెద్దలకు రూ. 22 కోట్లకే కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ విషయమై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం నాడు తుదితీర్పును ఇచ్చింది. రూ.22 కోట్ల కంటే ఎక్కువగా మరో రూ. 5 కోట్ల చెల్లిస్తే ఆ భూములను మీకే కేటాయిస్తామని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కి కోర్టు బంపర్ ఆఫరిచ్చింది.
అయితే ఆ రూ. 5 కోట్ల కంటే ఎక్కువగా డబ్బులను చెల్లించేందుకు తాను సిద్దమేనని రామకృష్ణారెడ్డి కోర్టుకు చెప్పాడు. అయితే రెండు వారాల్లో రూ. 10 కోట్లను చెల్లించాలని హైకోర్టు రామకృష్ణారెడ్డికి సూచించింది. మరోవైపు హైకోర్టు తీర్పును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వాగతించారు.