పుట్టపర్తి ఎంపీపీని చంపేందుకు పథక రచన: 11 మంది అరెస్ట్
హైదరాబాద్: అనంతపురం, చిత్తూరు జిల్లాలో నలుగురిని హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసును అనంతపురం సీసీఎస్ పోలీసులు శనివారం గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తపంచా, 4 వేటకొడవళ్లు, రెండు ఇనుపపైపులు, స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించి, అనంతపురం జిల్లా ఎస్పీ మాల్యాద్రి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం నలుగురిని హత్య చేసేందుకు వ్యూహా రచన చేశారని తెలిపారు.

పుట్టపర్తి ఎంపీపీ శ్రీరామ్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీరాములతోపాటు చంద్ర అనే వ్యక్తిని వీరు హత్య చేసేందుకు పూనుకున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లెలోని ఓ కళాశాల యజమానిని కూడా హత్య చేసేందుకు కుట్రపన్నారని మాల్యాద్రి చెప్పారు.
అరెస్టైన 11 మందిలో కదిరి పట్టణానికి చెందిన రౌడిషీటర్ నారాయణ నాయక్ కూడా ఉన్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications