AP Budget sessions 2025: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ఆ శాఖకే ప్రధాన కేటాయింపులు ..!!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఏపీకి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రెండవసారి సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఎప్పటిలాగానే వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.
2024 జూలైలో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా చూసుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.22 లక్ష కోట్లతో బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే కూటమి ప్రభుత్వం చేసిన కేటాయింపులపై పయ్యావుల కేశవ్ వివరించారు. ఇక అంతా ఎదురుచూస్తున్న తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి బడ్జెట్లో కనిపించాయి. బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ.6,705 కోట్లు కేటాయించారు. ఏపీ బడ్జెట్కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.













Click it and Unblock the Notifications