కాకినాడ పోర్టుపై సీబీఐ లేదా సీఐడీ దర్యాప్తు? షిప్ సంగతీ తేల్చబోతున్న ఏపీ కేబినెట్..!
ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన తర్వాత వార్తల్లో నిలిచిన కాకినాడ పోర్టు అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు వెళ్లిపోతోందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం దానికి అడ్డుకట్ట కూడా వేయలేకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన స్టెల్లా ఎల్ 1 షిప్ లో పట్టుబడ్డ రేషన్ బియ్యం వ్యవహారంలోనూ ఏమీ చేయలేని పరిస్దితి నెలకొంది.
సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం ఉన్న స్టెల్లా ఎల్ 1 షిప్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాకినాడ పోర్టులో జరుగుతున్న దందాపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే పోర్టు భద్రతపైనా సందేహాలు వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా దీనిపై సీబీఐ లేదా సీఐడీతో విచారణ చేయిస్తామన్నారు. ఇందుకోసం వచ్చే కేబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు దీనిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఇప్పటికే వైసీపీ హయాంలో కాకినాడ పోర్టును తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారంటూ విమర్శలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు విదేశీ షిప్ ను పట్టుకున్నా సీజ్ చేయలేని పరిస్దితుల్లో ఉండటంపై ఆత్మరక్షణలో పడింది. దీంతో కాకినాడ పోర్టులో సాగుతున్న రేషన్ బియ్యం దందాపై సీబీఐ లేదా సీఐడీతో విచారణ చేయించే విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే సముద్రంలో పట్టుకున్న విదేశీ షిప్ పై న్యాయపోరాటం చేస్తే తప్ప సీజ్ చేసే పరిస్దితి లేకపోవడంతో కోర్టులో కేసు వేసే అంశంపైనా ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications