కాకినాడ పోర్టుపై సీబీఐ లేదా సీఐడీ దర్యాప్తు? షిప్ సంగతీ తేల్చబోతున్న ఏపీ కేబినెట్..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన తర్వాత వార్తల్లో నిలిచిన కాకినాడ పోర్టు అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు వెళ్లిపోతోందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం దానికి అడ్డుకట్ట కూడా వేయలేకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన స్టెల్లా ఎల్ 1 షిప్ లో పట్టుబడ్డ రేషన్ బియ్యం వ్యవహారంలోనూ ఏమీ చేయలేని పరిస్దితి నెలకొంది.

సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం ఉన్న స్టెల్లా ఎల్ 1 షిప్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాకినాడ పోర్టులో జరుగుతున్న దందాపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే పోర్టు భద్రతపైనా సందేహాలు వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా దీనిపై సీబీఐ లేదా సీఐడీతో విచారణ చేయిస్తామన్నారు. ఇందుకోసం వచ్చే కేబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు దీనిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

ap cabinet to decide cbi or cid inquiry on Kakinada port irregularities and ship seizure

ఇప్పటికే వైసీపీ హయాంలో కాకినాడ పోర్టును తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారంటూ విమర్శలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు విదేశీ షిప్ ను పట్టుకున్నా సీజ్ చేయలేని పరిస్దితుల్లో ఉండటంపై ఆత్మరక్షణలో పడింది. దీంతో కాకినాడ పోర్టులో సాగుతున్న రేషన్ బియ్యం దందాపై సీబీఐ లేదా సీఐడీతో విచారణ చేయించే విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే సముద్రంలో పట్టుకున్న విదేశీ షిప్ పై న్యాయపోరాటం చేస్తే తప్ప సీజ్ చేసే పరిస్దితి లేకపోవడంతో కోర్టులో కేసు వేసే అంశంపైనా ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+