17న మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు, సీఐఐ సదస్సు 2018 సన్నాహక సదస్సు కోసం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం (17వ తేదీన) ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు 2018 సన్నాహక సదస్సులో పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా పాల్గొంటారు. ఇటీవలే నాలుగు రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు.

ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతో పాటు పలు అంశాలపై ఆయన ప్రధానితో చర్చించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications