18న ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ- ఈసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చేస్తారా?
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మరోసారి ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఎన్డీయే ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. మరోసారి వీరిని కలుసుకోనున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్దాయిలో వీరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో తాజాగా మద్యం టెండర్ల ప్రక్రియ పూర్తయి షాపులు కేటాయించారు. అయితే ఇందులో ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. వీటిపై టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలోనే రోజూ వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మద్యం టెండర్లలో జోక్యం చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ఇసుక తవ్వకాల విషయంలోనూ అధికార పార్టీల నాయకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, మద్యం వ్యవహారాలకు దూరంగా ఉండాలని నేరుగా సీఎం చంద్రబాబే చెప్తున్నా క్షేత్రస్దాయిలో నేతలు వినిపించుకునే పరిస్ధితులు లేవు. దీంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి అక్రమాల ఎమ్మెల్యేలకు మరోసారి హెచ్చరికలు పంపనున్నారు. అలాగే రాష్ట్రంలో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా నేతలతో చంద్రబాబు, పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
-
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications