దసరా నుండే అమరావతి నిర్మాణపనులు: చంద్రబాబు
దసరాకు అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ ఏడాది ఆగష్టు 15వ, తేదినాటికి అమరావతి డిజైన్లు ఇవ్వాలని ఆయన పోస్టర్స్ బృందాన్ని కోరారు.
అమరావతి: దసరాకు అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ ఏడాది ఆగష్టు 15వ, తేదినాటికి అమరావతి డిజైన్లు ఇవ్వాలని ఆయన పోస్టర్స్ బృందాన్ని కోరారు.
శుక్రవారంనాడు ఆయన అమరావతి మాస్టర్ప్లాన్పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 31నుండి అక్టోబర్ 15 నుండి హైకోర్టు నవంబర్ మొదటివారంలో సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు. సమీక్షలో తీసుకొన్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.

రాజధాని మొత్తం కన్పించేలా 500 మీటర్ల ఎత్తులో టవరన్ నిర్మాణం, హెచ్ఓడి కార్యాలయాలు, సచివాలయం ఓకే క్యాంపస్లో ఉంటాయన్నారు.
రాష్ట్ర రాజధాని పరిపాలనా నగరంలో శాసనసభ సముదాయానికి వజ్రాకృతి , హైకోర్టు భవన సముదాయానికి పిరమిడ్, డిజైన్లు ఖరారయ్యాయి. గతంలో శాసనసభ సముదాయానికి స్థూపాకృతిని రూపొందించి తాజాగా దాన్ని వజ్రాకృతికి మార్చారు.
నార్మన్ ఫోస్టర్ సంస్థ హైకోర్టు కోసం రూపొందించిన వజ్రాకార భవన డిజైన్ను అసెంబ్లీ భవనాలకు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. లండన్ నుండి వచ్చిన రాజధాని మాస్టర్ అర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు గురువారం నాడు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
అమరావతి డిజైన్లపై ప్రజేంటేషన్ ఇచ్చారు. పరిపాలనా నగరం తుది డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించారు.












Click it and Unblock the Notifications