మద్యం అమ్మకాల పన్ను పై కీలక నిర్ణయం - ఇక నుంచి..!?
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త బార్ల పాలసీకి అనుగుణంగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త దరఖాస్తులకు ఆశించిన స్పందన రాలేదు. దీంతో, దరఖాస్తుల కోసం సమయం పొడిగించారు. ఇక.. బార్ల నిర్వాహకులు ఏఈఆర్టీ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల నిరాసక్తత కారణంగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఏఈఆర్టీ సడలింపు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఖరారు చేసిన కొత్త బార్ల పాలసీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. 412 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీంతో, మిగిలిన వాటికి సమయం పొడిగిస్తూ మరో సారి నోటిఫికేషన్ జారీ చేసింది. 17వ తేదీతో గడువు ముగిసింది. అయితే, 96 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మరో 336 బార్లకు దరఖాస్తులు రాలేదు. ప్రధానంగా గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో బార్ల నిర్వహణకు వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. మద్యం షాపుల్లో పర్మిట్ రూమ్స్ కు అనుమతి.. రూ 99కే క్వార్టర్ లిక్కర్ అమ్మకాల కారణంగా బార్ల పైన వ్యాపారులు ఆసక్తి చూపటం లేదనే వాదన ఉంది. దీంతో, పాటుగా అదనపు ఎక్సైజ్ రిటైల్ టాక్స్ భారంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ టాక్స్ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే మద్యం పైన 15 శాతం అదనపు ఎక్సైజ్ రిటైల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించి.. బార్ల పైన మాత్రమే ఈ పన్ను వసూలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం అమ్మకాల్లో మార్పులు చేసారు. అయితే, వ్యాపారుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్న ఏఈఆర్టీ రద్దు చేయాలనే ప్రతిపాదన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని రద్దు చేస్తే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుంది. అయితే, మద్యం దుకాణాల ద్వారా అమ్మకాల పైన స్వల్పంగా ఈ మేర భారం వేసే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. మద్యం పాలసీ పైన నియమించిన కేబినెట్ సబ్ కమిటీ తో చర్చించిన తరువాత ప్రభుత్వానికి ఈ అంశం పైన తుది నివేదిక ఇవ్వనున్నారు. దసరా తరువాత ఏఈఆర్టీ పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications