ఏపీలో ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు- ఈ సారి వారికే కేటాయింపు, విక్రయాలు ఇక..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 2024 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రెండేళ్ల పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త పాలసీ ఖరారు పైన కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా ఎక్సైజ్‌ శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధానంగా పాలసీ రెన్యువల్‌పైనే చర్చ సాగుతోంది. దీంతో.. ప్రస్తుతం ఉన్న వారికే మరోసారి మద్యం షాపులు దక్కే అవకాశం ఉంది. దీని పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

ఏపీలో కొత్త మద్యం పాలసీ పైన పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సింగ్ గడువు ముగియనుంది. దీంతో.. కొత్త పాలసీ పైన కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అమల్లోకి తెచ్చి 3,396 షాపులకు లైసెన్సులు కేటాయించింది. గతంలో షాపుల కేటాయింపు సమయాన దరఖాస్తు ఫీజుల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 1,900 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే, ఆ తర్వాత తాము ఆశించిన స్థాయిలో వ్యాపార మార్జిన్లు రాక నష్టపోయామని అనేకమంది లైసెన్సీలు గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వం తర్వాత మార్జిన్లను కొంత పెంచింది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీకి వెళ్తే అన్ని దరఖాస్తులు రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. దానివల్ల ప్రభుత్వ ఖజానాకు లోటు ఏర్పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. దీంతో కొత్త పాలసీకి కాకుండా ప్రస్తుత లైసెన్సీలతోనే పాలసీ రెన్యువల్‌ చేయాలనే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

 జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్..!!
జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్..!!
ap-excise-officials-begin-exercise-on-new-liquor-policy-key-proposals-before-the-govt-here-the-det

ప్రభుత్వం ముందు కీలక ప్రతిపాదనలు

ఇదే సమయంలో మరో ప్రతిపాదన సిద్దం చేసారు. గతంలో వచ్చిన రూ.1900 కోట్లను లైసెన్స్‌ ఫీజులుగా చెల్లిస్తే ప్రస్తుత లైసెన్సీలకే రెన్యువల్‌ చేసి.. ఇక లాటరీ లేకుండానే వారికే దుకాణాలు కొనసాగించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ మేరకు పట్టణాల్లో రూ.40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల చొప్పున లైసెన్సీలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. దీనిని ఒక్కసారిగా కాకుండా ఏడాదికి 50 చొప్పున చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. దీనిపై రెండు సార్లు లైసెన్సీలతో చర్చలు జరిపారు. లైసెన్సీలు కూడా చాలామంది రెన్యువల్‌కు అనుకూలంగానే ఉన్నారు. కొద్ది మంది మాత్రం అంత పెద్దమొత్తం దరఖాస్తు ఫీజు చెల్లించడం తమవల్ల కాదని అంటున్నారు. దీంతోపాటు కొత్తగా మళ్లీ పాలసీకి వెళ్లడంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి పైన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు వెల్లడించారు.
ఇదే సమయంలో మరో ప్రతిపాదన సిద్దం చేసారు. గతంలో వచ్చిన రూ.1900 కోట్లను లైసెన్స్‌ ఫీజులుగా చెల్లిస్తే ప్రస్తుత లైసెన్సీలకే రెన్యువల్‌ చేసి.. ఇక లాటరీ లేకుండానే వారికే దుకాణాలు కొనసాగించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ మేరకు పట్టణాల్లో రూ.40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల చొప్పున లైసెన్సీలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. దీనిని ఒక్కసారిగా కాకుండా ఏడాదికి 50 చొప్పున చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. దీనిపై రెండు సార్లు లైసెన్సీలతో చర్చలు జరిపారు. లైసెన్సీలు కూడా చాలామంది రెన్యువల్‌కు అనుకూలంగానే ఉన్నారు. కొద్ది మంది మాత్రం అంత పెద్దమొత్తం దరఖాస్తు ఫీజు చెల్లించడం తమవల్ల కాదని అంటున్నారు. దీంతోపాటు కొత్తగా మళ్లీ పాలసీకి వెళ్లడంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి పైన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు వెల్లడించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+