కరోనా నిధికి ఏపీ గవర్నర్ స్వచ్ఛంద విరాళం - 30 శాతం జీతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ

కరోనా వైరస్ నియంత్రణ కోసం జాతీయ స్దాయిలో జరుగుతున్న పోరాటానికి తాను సైతం అంటూ ముందుకొచ్చారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల కోసం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన నేఫథ్యంలో తన జీతంలో కూడా 30 శాతం స్వచ్ఛంద విరాళంగా ఇవ్వాలని హరిచందన్ నిర్ణయించుకున్నారు.

కరోనాపై పోరుకు ఏపీ గవర్నర్ చేయూత..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తన వంతుగా సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముందుకొచ్చారు. తన నెల జీతంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇవ్వాలని
గవర్నర్ హరిచందన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో తన వంతుగా స్వచ్ఛంద విరాళం ఇవ్వాలని గవర్నర్ నిర్ణయించారు

ap governor offers vountary donation of 30 percent salary to pm cares fund

రాష్ట్రపతికి లేఖ రాసిన గవర్నర్

ap governor offers vountary donation of 30 percent salary to pm cares fund
వచ్చే ఏడాది పాటు తన నెలజీతంలో 30 శాతాన్ని పీఎం కేర్స్ నిధి కోసం తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు గవర్నర్ హరిచందన్ ఇవాళ అంగీకార లేఖ రాశారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలువురు స్వచ్ఛంద సాయానికి ముందుకొస్తున్న నేపథ్యంలో తన జీతంలో 30 శాతాన్ని తీసుకోవాలని లేఖలో గవర్నర్ కోరారు. గవర్నర్ అదేశాల మేరకు రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+