ఎస్సీ వర్గీకరణ పై చంద్రబాబు కీలక నిర్ణయం..!!
ఎస్సీ వర్గీకరణ అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ పైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఏక సభ్య కమిషన్ నియమించింది. 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదిక అందిన తరువాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు అధ్యయనం చేసి నివేదిక కోరుతూ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నివేదిక ఇచ్చేందుకు 60 రోజుల గడువు నిర్దేశిస్తూ ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వర్గీకరణ దిశగా నిర్దిష్టమైన సిఫార్సులను సూచించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమిషన్ కు కావాల్సిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది.

60 రోజుల సమయం
వర్గీకరణ పై ఏర్పాటైన కమిషన్ విధి విధానాలను ఖరారు చేసారు. రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారం అందించాల్సి ఉంటుంది. జనాభా గణన పరిగణనలోకి తీసుకోవటంతో పాటుగా.. ఎస్సీ ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయటం పైన సూచనలు చేయాలి. షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాల వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలపై దృష్టిపెట్టాలి. అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.
వర్గీకరణ కు వీలుగా
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏపీలో ఎస్సీ వర్గీకరణను సమర్థంగా అమలు చేసేలా విధానాన్ని గుర్తించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉప కులాలకు సమానంగా అందేలా పంపిణీ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ఏక సభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంటుంది. ఇందుకు రెండు నెలల సమయం ప్రభుత్వం నిర్దేశించింది. మాజీ ఐఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ మేరకు అధ్యయనం చేయటంతో పాటుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
-
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
లెక్క మారుతోంది, ఇక నుంచి - టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!! -
Tirupati: తిరుపతికి కేంద్రం గుడ్ న్యూస్-ఇక అంతా అక్కడే..! -
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
అమరావతి వేదికగా అరుదైన నిర్మాణం, తెలుగు వైభవాన్ని చాటేలా..!! -
LPG: ఏపీలో ఎల్పీజీ గ్యాస్ పరిస్ధితి ఇదే..! తేల్చేసిన సర్కార్-స్పెషల్ టీమ్స్..! -
ఈ నెల 13న పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ : ఒకేసారి రూ 6 వేలు..!! -
మండే ఎండల వేళ భారీ వర్షాలు, ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! -
NTR Vaidya Seva: డబ్బులిస్తేనే వైద్యం-ఏపీ సర్కార్ కు తేల్చేసిన ఆస్పత్రులు..! -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..!












Click it and Unblock the Notifications