పండుగ వేళ ఉద్యోగుల బకాయిల జమ, ఖాతాలు చెక్ చేసుకోండి..!!
ఏపీ ప్రభుత్వం పండుగ వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగుల బకాయిలను విడుదల చేసింది. సంక్రాంతి కానుకగా ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలను జమ చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు బ్యాంకుల నుంచి మెసేజులు అందుతున్నాయి. సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజున ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు వరుసగా జమ అవుతున్నాయి.
సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని సంక్రాంతి వేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు నిధులను జమ చేస్తున్నారు. పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగుల డీఏ కోసం ఏకంగా రూ.110 కోట్లు విడుదుల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక పోలీసులకు సరెండర్ లీవ్ చెల్లింపులు కూడా రిలీజ్ చేయనుంది. దీని ద్వారా 55 వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఇక డీఏ, ఏరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల మంది ఉద్యోగులు బెనిఫిట్ పొందనున్నారు. అదే విధంగా 2.70 లక్షల మంది పెన్షన్లర్లు కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో లబ్ది పొందనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల మొత్తం 5.70 లక్షల మందికి ప్రయోజనం దక్కనుంది.

సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు డీఏ, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవులతో పాటు కాంట్రాక్టర్లకు పెండింగులో ఉన్న బిల్లులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో భోగి పండుగ రోజు ఈ నగదు బకాయిలు చెల్లించింది. నగదు ఖాతాల్లో జమ కావడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. డీఏ, డీఆర్ఏ ఎరియర్స్ నిమిత్తం ఒక్కో ఉద్యోగి, పోలీసుల ఖాతాల్లో రూ.70 నుంచి రూ.80 వేల వరకు నగదు జమ అవుతుంది. పండగ పూట డీఏ, డీఆర్ఏ బకాయి లు జమ కావడంతో ఉద్యోగులతోపాటు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం లోగా అందరి ఉద్యోగుల ఖాతాల్లోనూ బకాయిలు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
భట్టి బడ్జెట్ తో ఉద్యోగులకు దక్కిందేంటి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications