పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు- ప్రభుత్వం తాజా ఆదేశాలతో..!!
ఏపీలో పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత పెన్షన్ ను రూ 4 వేలకు పెంచి ప్రతీ నెలా ఒకటో తేదీన అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ నెలా స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో, వితంతు.. ఒంటరి మహిళల కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక.. జూన్ 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల అంశం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఒక రోజు ముందే
ప్రతీ నెలా ఒకటో తేదీన వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్ లబ్ది దారుల ఇంటికి వెళ్లి పెన్షన్ సొమ్ము అందిస్తున్నారు. కాగా, జూన్ 1న అందాల్సిన పెన్షన్ ను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తేదీ ఆదివారం కావటంతో ముందు రోజునే పెన్షన్లు అందించనుంది. ఈ మేరకు మే 31న పెన్షన్ల పంపిణీకి వీలుగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. మే 31న ఉదయం సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని సూచించారు. ఒకవేళ మే 31న డబ్బులు అందుకో లేని వారి కోసం, జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పింఛన్ తీసుకునే అవకాశం కల్పించారు.

కొత్త పెన్షన్లు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో.. స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 12న వీరికి పెన్షన్లు పంపిణీకి ముహూర్తం ఖరారు చేసారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం.. వీరికి పంపిణీ దిశగా నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే, భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ ఇవ్వటం మొదలు పెట్టారు. 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు కూడా పెన్షన్ ఇవ్వాలని సెర్ఫ్ ఆదేశించింది. ఇందుకు సంబంధించి లబ్ది దారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు. కొత్తగా పెన్షన్ల మంజూరు ద్వారా దాదాపు రూ 36 కోట్ల మేర ప్రభుత్వం పైన అదనపు భారం పడనుంది.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications