కడప మేయర్ సురేష్బాబుపై మళ్లీ అనర్హత వేటు, వాట్ నెక్స్ట్..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప మేయర్ సురేశ్ బాబు పైన అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలోనే పలు ఆరోపణల కారణంగా సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తెలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఆ సమయంలో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచన మేరకు సురేష్ బాబుకు మరో అవకాశం కల్పించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సురేశ్ బాబు పైన వచ్చిన ఆరోపణల నిర్ధారణతో అనర్హత వేటు వేస్తూ నిర్ణయించింది.
కడప మేయర్ సురేశ్ బాబు పదవి కోల్పోయారు. సురేష్ బాబు పైన అనర్హత వేటు వేస్తూ ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సురేష్ బాబు కుటుంబీకులు కడప నగర పాలక సంస్థ లో సివిల్ కాంట్రాక్టులు చేపట్టారని.. ఎమ్మెల్సీ మాధవి రెడ్డి గత ఏడాది ఫిర్యాదు చేసారు. దీని పైన విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి కాంట్రాక్టులు చేసిన విషయం వాస్తవమేనని తేల్చి ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో, పురపాలక శాఖ ఈ ఏడాది మార్చి 24న సురేష్ బాబు కు నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత పదవి నుంచి తెలిగిస్తూ మేలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, సురేష్ బాబు ఈ ఉత్తర్వుల పైన హైకోర్టును ఆశ్రయించారు. ఉద్దేశ పూర్వకంగా తనను మేయర్ పదవి నుంచి తప్పించారని పేర్కొన్నారు. సురేష్ బాబు పిటీషన్ పైన హైకోర్టులో వాదనలు జరిగాయి.

సురేష్ బాబు నుంచి పదవి తొలిగింపు పై హైకోర్టును ఆశ్రయించటంతో పాటుగా.. తన వాదన వినిపించేందుకు మరో అవకాశం కల్పించాలని కోరారు. దీంతో, సురేష్ బాబుకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తన వాదన వినిపించారు. విజిలెన్స్ విచారణ కమీషన్ వాంగ్మూలం పరిగణలోకి తీసుకున్న మున్సిపల్ శాఖ మేయర్ ను పదవి నుంచి తెలిగించింది. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్ ను ఈ రోజు అధికారులు సురేష్ బాబుకు అందించనున్నారు. కాగా, సురేష్ బాబు ను పదవి నుంచి తప్పించటంతో.. ఇప్పుడు వైసీపీ నేతలు ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..! -
ఏపీ ప్రజలకు ఉగాది కానుక.. వారికి ఏకంగా లక్ష ఇళ్ళు! -
రాములోరి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం- తేదీలు ఖరార్ -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు












Click it and Unblock the Notifications